మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6
16-అచ్చ తెనుగు కవి,మనువు పుట్టువు ,మెచ్చుల పచ్చ ముచ్చెలి కర్త , కవితా కళానిధి- శ్రీ నారు నాగనార్య
నారు నాగనార్య (జులై 3, 1903 – జనవరి 18, 1973) సాహితీవేత్త.
జీవిత విశేషాలునారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో…
View On WordPress
0 notes
Paadana Telugu Paata Song Lyrics in Telugu & English | America Ammayi Movie Songs 1976
Paadana Telugu Paata Song Lyrics in Telugu & English | America Ammayi Movie Songs 1976
Paadana Telugu Paata Song Lyrics written by Devulapalli Krishna Sastry, music composed by GK Venkatesh, and sung by S P Balasubramanyam and Susheela from Telugu movie ‘America Ammayi‘.
పాడనా తెనుగు పాటా video song from Shalimar Film Express
Paadana Telugu Paata Lyrics in English
Paadana Telugu PaataPaadana Tenugu PaataParavashanai Mee Eduta Mee PaataPaadana Tenugu Paata
Kovela Gantala…
View On WordPress
0 notes
భారతదేశం అపురూపం "కలివికోడి"....మీరు చూసారా?
భారతదేశం అపురూపం “కలివికోడి”….మీరు చూసారా?
కలివికోడి
కడపసీమలో అపురూపమైన కలివి కోడి
అనేక దశాబ్దాలుగా కనుమరుగయిన బిడ్డ అనుకోకుండా దర్శనమిస్తే ఆ తల్లిదండ్రులు, బంధువులు ఎంతగా ఆనందపడతారో కదా. అదే విధంగా ఇటీవల, అదృశ్యమైపోయిన కొన్ని జాతుల పక్షులు, జంతువులు తిరిగి కనబడడంతో శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవలసినది ఒక అచ్చ తెనుగు పిట్ట: కలివి కోడి.
ఆ విశేష పక్షిని శాస్త్రజ్ఞులు కర్సోరియస్ బిటర్…
View On WordPress
0 notes
Tweeted
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా మరోసారి వినండి!
❝మా తెనుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు❞
👉 https://t.co/FDMuQprUgm#తెలుగునువెలిగిద్దాం
— వీవెన్ (@VeevenV) August 28, 2018
0 notes
తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష తీయదనం.. తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం.. ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతుంది. వ్యవహారిక భాషా ఉద్యమకర్త, తేట తెలుగు భాషను ముందు తరాలకు వారసత్వంగా అందించిన దార్శనిక కవి గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని.. తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రోజూ మాట్లాడుకునే భాషవేరు ... గ్రంధాల్లో ఉండే భాష వేరు అని గ్రహించి అందరికీ అందుబాటులో ఉండి తేలికగ మాట్లాడుకునే వాడుక భాషలోనే.... చదువుకునే వీలు కలిపించాలని ఒక తెలుగు ఉద్యమమే నడిపిన తెలుగు "పిడుగు".. గిడుగు. రామ్మూర్తిపంతులుగారి జయంతిని ఇవాళ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారి గొప్పతనం. గ్రాంధికభాషలో ఉన్న తెలుగును ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలువనూ తెలియచేసిన మహనీయుడు. సామాన్యజనం పాడుకోనేలా పద్యాలు రాసిన తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళవేంకటశాస్త్రి గారు, మన పిడుగు గురించి ఏవన్నారంటే..... "ఏమైనా అభిమానమంటూ మిగిలిన .. ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే" అని. ఇక మన మహానుభావుడే ....విశ్వనాధ సత్యనారాయణగారు అయితే గిడుగు గారిని "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట" అని మెచ్చుకున్నారు.. తేనెలొలికే భాష తెలుగు. అమ్మదనం నిండిన కమ్మనైన భాష తెలుగు. ఏ దేశమేగినా నీ ఆత్మబంధువు తెలుగు. వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆంధ్రుల శబ్ధం కనబడుతుంది. ఆంధ్ర అనే పదం 2600 సంవత్సరాలకు పూర్వమే ఐతరేయ బ్రాహ్మణంలో ఉపయోగించబడింది. తర్వాత రూపాంతరంలో తెలుగుగా స్థిరపడింది. తేనె అంటే దక్షిణ దిక్కు అని ఒక అర్థం. అందుకే దక్షిణాదిన నివసించే వారు కాబట్టి తెనుగు వారు అంటారనేది ఒక వాదన. ఆంధ్ర దేశంలో 2700 సంవత్సరాలకు పూర్వమే అచ్చ తెలుగు గ్రంథాలు లభ్యమయ్యాయి. నన్నయ్య కాలం నుంచి ఇంకా ఎక్కువ గ్రంథాలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు భాష శాతవాహనుల కాలం నుంచి ఉన్న ఇక్ష్వాకుల కాలంలో చాలా అభివృద్ధి సాధించింది. చాళుక్యుల కాలంలో శాసనాలు లభ్యమయ్యాయి. తెలంగా, తెలింగా, తిలాంగ్ అనేవి తెలుగు లిపికి ఉన్న పేర్లు. తెలుగు వారు రాసే లిపిని ఆంధ్ర లిపి అని కూడా అంటారు. అమరావతి స్తూప శిథిలాలలోని రాతి పలకల మీద 3వ శతాబ్ధంలో ' నాగబు' అనే తెలుగు తొలి పదం లభ్యమయ్యింది. భారతదేశంలో ఉన్న ప్రస్తుత ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. తెలుగుకు మూలం సంస్కృతం. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల జాబితాలో తెలుగు 15వ స్థానంలో వుంది. ఇంచుమించు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు వుండనే వుంటారు. అయితే గత చరిత్రను తవ్వుకుని సంఖ్యా ఆధిక్యాన్ని చాటుకొని కాలం వెళ్లదీసుకుంటున్నామే కానీ, నేటి సమాజంల�� తెలుగు భాషా స్థితిని తల్చుకుంటే కొంత బాధకలగక మానదు. 2006 లోనే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కొందరు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాజాగా ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలున్నాయని స్పష్టం చేసింది మద్రాసు హైకోర్టు. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు , తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సంఘం మద్రాసు హైకోర్టుకు పూర్తి వివరాలు అందజేశారు. దీంతో తెలుగు భాష ప్రాచీనమేనని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రాచీన హోదా లభించడం వల్ల ..భాష అభివృద్ధి కోసం కేంద్రం ఐదేళ్లకొకసారి రూ.వంద కోట్ల రూపాయలు ఇస్తుంది. దీనివల్ల ఆ భాషకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించుకోవచ్చు. అంతర్జాతీయ, జాతీయ పురస్కారాల ప్రదానంతో పాటు తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి, పుస్తకాలను ముద్రించి ప్రచారం చేసుకోవచ్చు. ప్రాచీన హోదా రాగానే ఆ భాషకు సంబంధించి ప్రత్యేక కేంద్రం ఏర్పాటవుతుంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటుంది. తెలుగు భాష గొప్పతనం ఈ నాటిది కాదు. ప్రపంచ దేశాలలో తెలుగు గొప్పతనం ఆనాడే చాటి చెప్పారు. కాగా యునెస్కో అంచనా ప్రకారం అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మేల్కోని, తెలుగు భాష పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, ఆ మహానుభావుడు గిడుగురామ్మూర్తిపంతులుగారిని స్మరించుకుంటూ.. విశ్వభాషలందు తెలుగు లెస్స.... మన తెలుగు మన భాష. అందరికీ శుభాకాంక్షలు..
0 notes
భాగవత పరమార్ధం
భాగవత పరమార్ధం
ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన గ్రంధాలు రచించి ,యూని వర్సిటి గ్రాంట్స్…
View On WordPress
0 notes
సిద్ధ యోగుల సిద్ధ గుటిక
సిద్ధ యోగుల సిద్ధ గుటిక .
సరసభారతి ఆస్థానకవులు మాrపూర్తి చేసి ,ఇప్పుడే ఆపుస్తకం చదివాను .నిజంగా సిద్ధ ఘుటిక అనిపించింది .ఆచార్యులవారి పాండిత్యానికి,వైదుష్యానికి బహుకావ్యాను శీలానికి ,తానూ సిద్ధహస్తులైన పద్యకవిత్వానికి ,తన బహు శాస్త్ర పరిచయానికి ,అధ్యన శీలత్వానికి ,బహుకాల తెనుగు బోధనాపటిమకు అద్దంపట్టిన రచన . 2019డిసెంబర్ లో మేముఒంటి మిట్ట యాత్ర చేసినప్పుడు తిరుగు ప్రయాణం లో బ్రహ్మం గారి…
View On WordPress
0 notes
భారతదేశ అపురూపం "కలివికోడి" ని మీరు చూసారా?
భారతదేశ అపురూపం “కలివికోడి” ని మీరు చూసారా?
కలివికొడి
కడపసీమలో అపురూపమైన కలివి కోడి
అనేక దశాబ్దాలుగా కనుమరుగయిన బిడ్డ అనుకోకుండా దర్శనమిస్తే ఆ తల్లిదండ్రులు, బంధువులు ఎంతగా ఆనందపడతారో కదా. అదే విధంగా ఇటీవల, అదృశ్యమైపోయిన కొన్ని జాతుల పక్షులు, జంతువులు తిరిగి కనబడడంతో శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవలసినది ఒక అచ్చ తెనుగు పిట్ట: కలివి కోడి.
ఆ విశేష పక్షిని…
View On WordPress
0 notes
Tweeted
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా మరోసారి వినండి!
❝మా తెనుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు❞
👉 https://t.co/FDMuQprUgm#తెలుగునువెలిగిద్దాం
— వీవెన్ (@VeevenV) August 28, 2018
0 notes
తెలుగు బాష ప్రాముఖ్యత తెలుగు బాష ప్రాముఖ్యత ఉపోద్గాతము : “చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు “దేశబాషలందు తెలుగులెస్స” అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము. దేశ బాషలందు తెలుగు లెస్స: మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు తెలుగులెస్స అన్న మాట. తెలుగు బాష మాధుర్యం: తెలుగు బాష మాధుర్యానికి కారణాలను పరిశేలిద్దాం. తెలుగు ద్రావిడ బాషలలో నుండి పుట్టింది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము, సుకుమారము అయిన తెలుగువాణి, సంస్కృత బాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని, తల్లికి, అక్కా చెల్లెండ్రకూ లేని క్రొత్త అందాలను అలవరుచుకుంది. తెలుగు బాష సస్యశ్యామలమైనది: తెలుగు గడ్డ కవితా సస్యశ్యామలమైనది. సహృదయ సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలు ఏ బాష వాడైనా, తెలుగు బాషకే కావితాకర్పూర నీరాజనం అందించాడు. “తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు మురళి రవాళులు! కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” అని నండూరి వారు అన్నారు. తెలుగు బాష కోటి కిటికీల గాలి మేడ: తెలుగు బాష కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుతుంది.తెలుగు బాష కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత. మన తెలుగు కవులు: నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యము తో మెప్పించిన ఉద్ధండ కవులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీణులు. సంస్కృతాంధ్ర పదములు ప్రయోగించటం లో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పధములు ఇష్టమైన ఇద్దరినీ మెప్పిస్తానన్నాడు. పెద్దన మనుచరిత్ర లో ఇంతలు కన్నులుండ అని వ్రాసిన పధ్యము లోని తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు పడుగుపెకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విధ్యలో నేర్పరులే. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశంలో ఏ కవులకూ జరగలేదు. తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాష వాజ్మయము లో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్య ను రాజరాజు ఆదరించాడు. తిక్కన ను మనుసిద్ది, ఎఱ్ఱప్రెగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. సాహితీ బొజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు. Telugu is the Italian of the East: తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు. తెలుగు బాషలో వచనానికి కూడా సంగీత సాహచర్యం ఉంది. తెలుగు పాటలో, పధ్యములో సంగీత సాహిత్యాలు గంగాయమున వలే సంగమించి ఉంటాయని సహృధయులందరికీ విదితమే. పధ్య కవిత్వంతో పాటు తెలుగు బాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఏ ఇతర బాషల్లోనూ లేవు. రామధాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు రచించాడు. తెలుగు వారి కళాభినివేశమునకు, మూర్తీభవించిన పారాకాష్ట త్యాగరాజు. మాతృబాషలో విధ్యాబోధన: గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ వ్రాశారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని, రవీంధ్రుడు అన్నాడు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. “మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది”. “మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.” అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము. అధికార బాషగా తెలుగు: తెలుగును పరిపాలనా బాషగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1966 లో తెలుగును అధికారాబాష గా ప్రవేశపెట్టిన బిల్లు చట్టం అయింది. ప్రబుత్వ శాఖలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని 1966 డిసెంబర్ లో ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా బాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించటానికి పింగళి లక్ష్మీకాంతం, జి.ఆర్.పి గ్విన్ ల అధ్యక్షతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రబుత్వంలో ఒక శాఖగా 1974 మార్చి 19 న “అధికార బాష సంఘం” ఏర్పడింది. తెలుగు భోదనా భాషగా అమలుకు సూచనలు: ప్రజాస్వామ్య యుగంలో ప్రజల బాషలో పరిపాలన సాగించాలి. పాలకుల బాష ఒకటి, పాలితుల బాష మరొకటి అయితే, పరిపాలన అడవిని కాచిన వెన్నెల అవుతుంది. ప్రజలకి తమ బాషలో సమస్యలని చెప్పుకొనే హక్కు ఉండాలి. అధికారులు తెలుగులో వివరించే బాధ్యతని కలిగి ఉండాలి. మాతృబాషలో విధ్యార్జన సులభం. ఇది గమన సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని వేగవంతం చేస్తుంది, సృజనాత్మకతకు తోడ్పడుతుంది. అయితే తెలుగు బాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చెయ్యాలి. తెలుగులో పాఠ్యగ్రంథాలను ప్రచురిస్తూ, వాటిని మధ్యమధ్యన పరిష్కరిస్తూ ఉండాలి సమగ్రమైన పారిభాషిక పద కోశాల్ని తయారుచేయించాలి. వైజ్ఞానిక, సామాజిక విషయాలపై గ్రంథాలను విరివిరిగా అనువాదం చేయించాలి. ప్రభుత్వము, తెలుగు అకాడమీ, విశ్వవిధ్యాలయాలు వంటి ద్వారా అన్ని స్థాయిలలో, తెలుగు బోధనా బాషగా అమలు చేసేంధుకు వీలుగా గ్రంథాలు రాయించాలి. ప్రజల్లో చైతన్యం వచ్చి, ధీక్షతో, పట్టుదలతో తెలుగును బోధనా బాషగా అమలు చేయటంలో సహకరించాలి. తెలుగును బోధనా బాషగా చదివిన వారికి సాధుపాయాలు కల్పించాలి. తెలుగులో ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉన్నత పరీక్షలు వ్రాసే పద్దతిని అమలు చెయ్యాలి. ప్రబుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి. టైప్ రైటింగ్, షార్ట్ హాండ్, కంప్యూటర్ లలో తెలుగుకి ప్రాధాన్యం కల్పించాలి. సమాప్తి: తెలుగు బాష పట్ల మమకారం అంకిత భావం ఉండాలి. ప్రజల వద్దకు పాలన అన్నది తెలుగు బాషను పరిపాలనా బాషగా పూర్తిగా అమలు పరిచినప్పుడే సాధ్యమవుతుంది. అభిమానం మాటలకే పరిమితమైతే “దేశ బాషలందు తెలుగు లెస్స్” అనే పరిహాసానికి గురికాక తప్పదు. కాబట్టి ప్రభుత్వం తెలుగు పట్ల శ్రద్ద వహించాలి. అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే తెలుగు వెలుగు నాలుదిక్కులా వ్యాపిస్తుంది. ఈ విధంగా తెలుగును భోధనా బాషగా ప్రవేశపెట్టి, మన విధ్యార్థుల సర్వతోముఖ వికాసానికి ఫ్రబుత్వము, ప్రజలు కృషి చేయాలి. కూన రసజ్ఞ, నిర్మల్, ఆధిలాబాద్ జిల్లా.
0 notes